టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక కొత్త సంవత్సరం ఏడాదిలో పవన్ కళ్యాణ్ జనవరిలోనే సరికొత్త సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాల వల్ల నిత్యం జనసేన పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో అభిమానులు కాస్త నిరుత్సాహం చెందుతున్నారు. ఆ తర్వాత పలువురు డైరెక్టర్లతో పవన్ కళ్యాణ్ పలు సినిమాలను ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ న్యూ ఇయర్ సందర్భంగా అభిమానుల్లో ఒక గుడ్ న్యూస్ తెలపబోతున్నట్లు తెలుస్తోంది.రీసెంట్గా తమిళంలో హిట్ టాక్ తో దూసుకుపోయిన తేరి చిత్రాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ గా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున హంగామా చేశారు. ముఖ్యంగా రీమిక్స్ సినిమాలు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పవన్ కళ్యాణ్ ను బెదిరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కానీ, మైత్రి మూవీ వారు కానీ, డైరెక్టర్ హరి శంకర్ కానీ ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోలేదు. తమ అనుకున్న విధంగా తేరి చిత్రాన్ని రీమిక్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో నటుడు సముద్రఖని ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.