మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మంచు మనోజ్ తన సినిమాలతో తనకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. మంచు ఫ్యామిలీ లోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమెజ్ క్రియేట్ చేసుకున్న మనోజ్ ఎప్పుడు ఇతరులకి సహాయం అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి మనోజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లి భూమా మౌనిక రెడ్డి తో చనువుగా ఉంటున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారాయి.
అయితే ఇదే విషయంపై తన కుటుంబ సభ్యుల నుంచి కూడా మనోజ్ కు అడ్డంకులు రావడంతో ఆయన తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి మనోజ్ తన కుటుంబ సభ్యులను కలవడానికి ఎంత ప్రయత్నించినా కూడా మంచు ఫ్యామిలీ మనోజ్ ను దగ్గరికి రానివ్వటం లేదని తెలుస్తుంది. ఇక ఈరోజు మనోజ్ తల్లి నిర్మలాదేవి జన్మదినం కావడంతో వాళ్ల తల్లిని తలుచుకొని మనోజ్ మరింత ఎమోషనల్ అయ్యాడు.
సోషల్ మీడియా ద్వారా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు..ఆ పోస్ట్కు తన తల్లి తనకు అన్నం ముద్దలు తినిపించే అరుదైన ఫోటోని దానికి జత చేశాడు. ఆ ఫోటో కింద ఓ ఎమోషనల్ కామెంట్ కూడా ఇచ్చాడు. “నా ప్రాణానికి ప్రాణం అయినా నా తల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఎప్పుడూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను.. ఈ సంవత్సరం మీరు ఏది కోరుకుంటే అది జరగాలని ఆ దేవుడినిప్రార్థిస్తున్నాను.. హ్యాపీ బర్త్డే అమ్మ” అంటూ తన పోస్ట్లో మనోజ్ రాసుకొచ్చాడు.
అయితే ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్కు మనోజ్ అభిమానులు ఆయనకు బాసటగా నిలుస్తూ తల్లిని కలుసుకోవడానికి బిడ్డలో ఎంత ఆరాటం ఉంటుందో మనోజ్ అన్నను చూస్తే తెలుస్తుంది అంటూ ఆ పోస్ట్కి కామెంట్లు ఇస్తూ మనోజ్ కు సపోర్ట్ చేస్తున్నారు.