పూరీ జగన్నాథ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆ హీరోయిన్..

ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో హిట్టు కొట్టడానికి బాగా కష్టపడిపోతున్నాడు. ఒకవైపు సినిమాలు తీస్తూనే ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో చాలా విషయాలను పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘ఇడియట్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటన అభిమానులతో పంచుకున్నారు.

అతడు మాట్లాడుతూ.. ‘ఇడియట్ మూవీ షూటింగ్ జరిగే సమయంలో హీరోయిన్ రక్షిత ఏడ్చే సీన్ ఒకటి ఉంది. ఆ ఏడ్చే సీన్ జరిగే సమయంలో రక్షిత ఏడవకుండా నవ్వుతోంది. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అప్పుడు నేను రక్షితతో ‘నువ్వు సరిగా ఫోకస్ చేయడం లేదు. ఇలా చేస్తే తరువాత సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను అని గట్టి వార్నింగ్ ఇచ్చా. దానికి తను వెంటనే ‘రాయి.. రాయకపోతే చంపేస్తా. ఈ సినిమా తరువాత నువ్వు డైరెక్టర్ చేసే 10 సినిమాలలో కూడా నేను చేస్తా, అసలు ఇప్పుడు నీకు ఏం కావాలో సరిగా చెప్పు చావు’ అని అన్నది. రక్షిత ఎలా అనగానే సెట్ లో ఉన్నవాళ్ళు అందరి క్లాప్స్ కొట్టారు…’

‘ఆ సమయంలో రక్షిత మాటలు చూసి నేను కుడా నవ్వు ఆపుకోలేకపోయాను. అసలు నేను ఊహించని సమాధానం ఆ అమ్మాయి నుంచి వచ్చింది. దాంతో ఆ అమ్మాయి మీద ఉన్న కోపం మొత్తం పోయింది.’ అని పూరీ చెప్పుకొచ్చాడు. రక్షిత సినిమాలోనే కాకుండా బయట కూడా అంత మాస్‌గా ఉంటుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.