యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఎప్పటినుంచో టాలీవుడ్ లో నటించాలని ఆశపడుతున్న జాన్వీ ఎన్టీఆర్ సినిమా కోసం ఓ త్యాగం కూడా చేస్తోందట.
తన టాలీవుడ్ ఎంట్రీకి ఎన్టీఆర్ పర్ఫెక్ట్ చాయిస్ అని భావించిన జాన్వీ ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటుందట. సాధారణంగా బాలీవుడ్ భామలు తెలుగు సినిమాలకు అధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. కానీ జాన్వీ అలా కాదట. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించాలనే ఉద్దేశంతో తన రెగ్యులర్ పారితోషికం కన్నా తక్కువే అడిగిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో జాన్వీని కొందరు సమర్థించినా.. కొందరు మాత్రం తొందరపడి తప్పు చేసిందంటూ అభిప్రయాపడుతున్నారు.