నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. విలక్షన నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తుంది.
తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ సైతం షురూ కానున్నాయి. అయితే ఇప్పటికే నెలకొన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ జరుగుతోంది.
అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా హక్కుల కోసం ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. దాదాపు రూ. 80 కోట్ల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు ఏ సినిమాకు బాలయ్య అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. వీర సింహారెడ్డి కోసం బాలయ్య రూ. 12 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.