తెలుగులో పాపులర్ కామెడీ షో లో ఒకటైన జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వల్ల ఎంతోమంది కమెడియన్స్ సైతం సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలా బుల్లితెరపై, వెండితెరపై కమెడియన్ గా పేరు సంపాదించిన కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో కామెడీ పంచలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే పేరుతో బాగానే ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు డైరెక్టర్ గా ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు..వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
వేణు వండర్ తెరకెక్కిస్తున్న చిత్రం బలగం. అనే టైటిల్ తో ఈ సినిమాని బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు. స్టార్ కమెడియన్ గా ఉంటూనే హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూ పేరు సంపాదించిన ప్రియదర్శి ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించిన బేబీ కావ్య ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో చిత్ర బృందం నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా పూర్తి వివరాలను మీడియాకు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ వేణు మాట్లాడుతూ బలగం సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తీస్తున్నాము..ఈ చిత్రం మొత్తం సిరిసిల్లి గ్రామంలోని జరుగుతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. తన మీద నమ్మకంతో తనకి అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి తన తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
View this post on Instagram