ఐకాన్ స్టార్ కు షాక్… అప్డేట్ కావాలంటూ రోడ్ ఎక్కిన అభిమానులు..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఆయన ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. పుష్ప2 కి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నారు. అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్పాది రైజ్‌ సినిమాని క్రేజీ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఎర్రచందనంస్మ‌గ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ లో పుష్ప సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అవడంతో అందరి చూపు పుష్పా2 పైన ప‌డింది.

ఇక ఈ చిత్రం పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్ర‌స్తుతం సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ రూపొందించే పనిలోనిలో ఉన్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా రీసెంట్ గా మొదలైంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ బన్నీ అభిమానులు గగోలు పెడుతున్నారు. అభిమానులు ఎంతగానో ఇష్టపడే హీరోని తెరపై త్వరగా చూడడానికి ఎంతో ఉత్సాహ పడుతున్నారు. త్వరగా తమ హీరోను తెరపైకి తీసుకురావాలని సినిమా యూనిట్ పై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా పుష్పా2 అప్డేట్ వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఇక దింతో ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో. బన్నీ అభిమానులు చేతిలో బ్యానర్లు- పోస్టర్లు పట్టుకొని పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఫిలిం ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలయ్య నిరసనలకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, యూఏఈ కి చెందిన అభిమానుల ఫోటోలు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.