త్రిబుల్ ఆర్ సినిమాకు ఎవరు ఊహించని గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ సినిమాలు కి ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ సంవత్సరం త్రిబుల్ ఆర్ చిత్రానికి వచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే ఈ జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి వీడియో సందేశాన్ని పంపారు.
“బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం క్యాటగిరి లో మా సినిమాకి అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా త్రిబుల్ ఆర్ టీమ్ అందరి తరఫు నుంచి జ్యూరీ మెంబర్లకు నా కృతజ్ఞతలు. బాహుబలి 2 సినిమా తర్వాత నాకు ఇది రెండో శాటర్న్ అవార్డు . నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఈ అవార్డుల ప్రధానోత్సవం లో పాల్గొనాలని అనుకున్నాను.. కానీ నేను ఇప్పుడు మా సినిమా ప్రమోషన్ లో భాగంగా జపాన్లో ఉండటం వలన నేను అవార్డు ఫంక్షన్ కి రాలేకపోతున్నాను.. ఈ అవార్డు వచ్చిన విజేతలందరికీ నా అభినందనలు”.. అని రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్- ఎన్టీఆర్ ప్రధానోపాత్రలో నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా జపాన్ లో విడుదలై అక్కడ కూడా ఎన్నో రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమా ప్రపంచ సినిమాలకు ఇచ్చే అవార్డు ఆస్కార్ నామినేషన్ లో కూడా త్రిబుల్ ఆర్ సినిమా ఉండటం విశేషం. సినిమాకు ఆస్కార్ రావాలాని ప్రతి తెలుగు సినిమా అభిమానులు.. భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.