బ్రేకింగ్: బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ ఆ రోజే..!

గ‌త‌ సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో బాల‌య్య‌ సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా పై ఎక్స్పెక్టేషన్ను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలయ్య డుయ్య‌ల్ రోల్‌ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది.

కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న క్రేజీ అనౌన్స్మెంట్ను రివిల్ చేసింది. ఇప్ప‌టివ‌రకు ఎన్.బి.కె 107అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. తాజాగా ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈనెల 21వ తేదీన ఎన్.బి.కె 107 టైటిల్ రివిల్ కాబోతుందని. కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికార ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్ గా పేర్లు సోషల్ మీడియాలో చక్కెరలు కోడుతున్నాయి. జై బాలయ్య, రెడ్డి గారు అనే టైటిల్ లు మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ సినిమా టైటిల్ అక్టోబర్ 21వ తేదీన అందరి ముందుకు రాబోతుంది.