కోలీవుడ్ స్టార్ జంట నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళకు నిన్న రాత్రి కవల పిల్లలు పుట్టారన్న వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తాము అమ్మానాన్నలం అయ్యామంటూ మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే నయనతార కు పిల్లలు ఏంటి… అదెలా సాధ్యం.. అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా లో ఆశ్చర్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. నయనతార కనీసం గర్భవతిగా కూడా ఉన్నట్టు తెలియదు. అలాంటిది తల్లెలా అయిపోయిందిని వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు. మరి కొంతమంది సరోగసి ద్వారా నయనతార విఘ్నేష్ లు తల్లిదండ్రులయ్యారని కామెంట్లో పెడుతున్నారు.
ఈ విషయం ఇలా ఉంచితే..వీరికి కవల పిల్లలు పుట్టిన వేల నయనతార గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే నయనతార కు కమల పిల్లలు పుడతారు అనే విషయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడని.. ఆ విషయం ఎన్టీఆర్కు ఎలా తెలుసు అని మీరు అనుకుంటున్నారా. ఆ విషయానికే వస్తున్నా.. 2010లో ఎన్టీఆర్ హీరోగా నయనతార- షీలా కౌర్ హీరోయిన్లుగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అదుర్స్ . ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశాడు. ఎన్టీఆర్ నటించిన చారి పాత్రకు హీరోయిన్ గా నయనతార నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ నయనతారకు కవల పిల్లలు పుడతారని చెబుతాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నయనతార నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని.. అలా పుట్టుమచ్చ ఉన్నవాళ్ళకి ఇద్దరు కవల పిల్లలు పుడతారని ఎన్టీఆర్ చెబుతాడు. ఇక ఇప్పుడు ఆ విషయమే నిజమైంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు గుర్తు చేస్తున్నారు.
అంతేకాకుండా ఆ సినిమాకి సంబంధించిన సీన్లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ. ఆ సినిమాలో ఎన్టీఆర్ అన్న మాటలు ఇప్పుడు నయనతార జీవితంలో నిజమైందని ఎన్టీఆర్ అభిమానులతో పాటు కొంతమంది నెటిజెన్లు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. నయనతారకు కవల పిల్లల పుట్టిన వేల ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.
@tarak9999 anna nijame cheppadu
Anyway congratulations pic.twitter.com/wfwOHIbEH8— RAM NTR ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ🐯 (@MYGODNTRJAINTR) October 9, 2022
Reel became Real pic.twitter.com/4Fbdy7ktuH
— ᐯ卂爪丂| (@RusthumVamsi1) October 9, 2022