ఇందిరా దేవి 100 సార్ల‌కు పైగా చూసిన మ‌హేష్ సినిమా ఏంటో తెలుసా?

ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇందిరా దేవికి చిన్న కొడుకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం, గారాబం అలాగే చిన్నప్పటినుంచి మహేష్ ను తల్లి చాటు బిడ్డలా పెంచిందట.

అలానే మహేష్ కూడా ఎక్కువ సమయం తన తల్లితో పాటే గడిపే వారట. ఇక అంత ప్రేమగా చూసుకున్న తల్లి ఇక దూరమైందన్న విషయాన్ని మహేష్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇందిరా దేవి కృష్ణ గారి సినిమా షూటింగ్స్ లో కూడా కనిపించేవారు కాదట.. కానీ మహేష్ బాబు సినిమా షూటింగ్స్ లో మాత్రం కనిపించే వారట. మహేష్ ఆమె తల్లి ఎక్కడికి వెళ్లినా తోడుగా ఉండేవారట. కొడుకంటే ఎంతో ప్రేమ అనురాగాలున్న ఇందిరా దేవి తన కొడుకు మహేష్ నటించిన ఒక సినిమాను మాత్రం ఏకంగా 100 సార్లు పైగానే చూశారట.

ఆ సినిమా ఏంటో తెలిసే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ సినిమా ఏదంటే.. తేజ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన `నిజం`. ఈ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులను అంతా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు అమ్మ మాట వింటూ సైలెంట్ గా అమాయకుడిగా ఉండే నిజాయితీపరుడి పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూసి తల్లి ఇందిరా దేవి ఎంతగానో మురిసిపోయేవారట. ఆవిడకి ఎప్పుడు సినిమా చూడాలనిపించిన `నిజం` సినిమా పెట్టుకుని చూసి ఆనందించే వారట. అలా మహేష్ బాబు నటించిన సినిమాల్లో కల్లా నిజం సినిమా ఇప్పటివరకు వందసార్లు పైగానే ఇందిరాదేవి చూశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.