`ఇడియట్` హీరోయిన్ రక్షిత ఎలా మారిపోయిందో చూశారా? అస్స‌లు గుర్తుప‌ట్ట‌లేరు!

రక్షిత.. హీరో రవితేజకు జంటగా `ఇడియట్` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రవితేజ తో పాటు హీరోయిన్ రక్షిత కి కూడా మంచి గుర్తింపు లభించింది. కన్నడ బ్యూటీ రక్షిత `ఇడియట్` సినిమాతో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేత.. అయితే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె రక్షితిగా తన పేరు మార్చుకుంది.ఇడియట్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన రక్షిత ఆ తరువాత మహేష్ బాబుతో `నిజం`, అక్కినేని నాగార్జునతో `శివమణి`, మెగాస్టార్ చిరంజీవితో `అందరివాడు`, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `ఆంధ్రావాలా` వంటి పలు సినిమాలలో నటించి మంచి స్టార్ డంను సంపాదించుకుంది. మంచి సినిమా అవకాశాలతో కెరీర్లో దూసుకుపోతున్న టైంలో 2007లో కన్నడ డైరెక్టర్ అయిన ప్రేమ్ ని పెళ్లి చేసుకుని ఇక ఆ తరువాత సినిమాలకు దూరమైంది.

అయినప్పటికీ కూడా కన్నడ టీవీ షో లలో జడ్జిగా పలు షోలలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇడియట్ హీరోయిన్ రక్షితను ఇప్పుడు చూస్తే ఎవరు అసలు గుర్తుపట్టలేనంతలా మారిపోయింది. రక్షిత హీరోయిన్గా ఉన్నప్పుడు మంచి ఫిజిక్ మెయింటైన్ చేసినా.. ఇప్పుడు భారీగా బరువు పెరిగిపోయింది. అయితే ఆమె అలా బరువు పెరగడానికి గల కారణం తన కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ వలన అంటూ రక్షిత ఓ సందర్భంలో ప్రేక్షకులకు తెలిపారు. ఇక అయితే ప్రస్తుతం రక్షిత భారీ ఆకారంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‌