తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులకు అది పండుగలాగా ఉంటుంది. చిరు కొత్త సినిమా గాడ్ ఫాదర్ ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీ జగన్నాథ్ కీలక పాత్రలలో నటించారు. ‘
ఆచార్య ప్లాప్ అయినా గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎవరు ఊహించని విధంగా జరిగింది. గాడ్ ఫాదర్ థియేట్రికల్ రైట్స్ నైజాంలో 22 కోట్లకు అమ్ముడుపోయింది. సీడెడ్ లో ఏకంగా 13 కోట్లకు అమ్ముడు పోగా, ఆంధ్రా లో ఈ సినిమా ఏకంగా 35 కోట్లకు అమ్ముడుపోయింది. గాడ్ ఫాదర్ తెలుగు రాష్ట్రాలలోనే ఏకంగా 70.50 కోట్లుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.
ఓవర్సీస్ లో కూడా గాడ్ ఫాదర్ 7.5 కోట్లకు…ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, హిందీ బెల్ట్ రాష్ట్రాలలో ఈ సినిమాను 6.50 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ పరంగా 90 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుంది అనేది చూడాలి.