నిన్న అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయన కొడుకు అల్లు అరవింద్ నేతృత్వంలో చిరంజీవి ముఖ్యఅతిథిగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాదులో కొత్త స్టూడియోను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ, ‘ మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆయనని తలుచుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎందరో నటులు ఉన్నప్పటికీ వారిలో కొంతమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అల్లు రామలింగయ్య వేసిన దారిలో అల్లు అరవింద్ నిర్మాతగా, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నటులుగా తెలుగు చిత్ర పరిశ్రమంలో అగ్రస్థానంలో ఉన్నారంటే దానికి కారణం అల్లు రామలింగయ్య నేే చెప్పాలి.
ఆయన కొన్ని దశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మనసులో మేదిలీన చిన్న కోరిక ఆయనకు నటనపై ఉన్న ఆస్తితో మద్రాసు వెళ్లి.., అక్కడ ఎన్నో వ్యయ ప్రయాసలు పడి అగ్ర నటుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో తన స్థానాన్ని సొంతం చేసుకున్నారు అల్లులు రామలింగయ్య. ఆయన వేసిన చిన్న పునాది ఇప్పుడు ఇది పెద్ద వ్యవస్థ లాగా మారింది. ఆయన చూపిన దారిలో అల్లు వారసులు ప్రతిక్షణం ఆయన తలుచుకుంటూనే ఉంటున్నారు. ఇప్పుడు ప్రారంభిస్తున్న అల్లు స్టూడియోస్ ని లాభాపేక్ష కోసం పెట్టిందని నేను అనుకోవట్లేదు. ఇది ఒక స్టేటస్ సింబల్. ఇది అల్లు రామలింగయ్య కి దక్కిన గుర్తింపు ఆయన పేరును కొన్ని తరాలు గుర్తుంచుకునేలా దీనిని నిర్మించారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగామైనందుకు అదృష్టంగా భావిస్తున్నాని చిరంజీవి తన ప్రసంగాన్ని ముగించాడు’.
తర్వాత ‘అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇవాళ మా తాత గారి 100వ పుట్టినరోజు. ఇది మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అల్లు అరవింద్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం మాా తాతగారు. తాత గారి పేరు మీద స్టూడియో పెట్టాలి ఎప్పుటి నుంచో అనుకుంటున్నాము. కానీ మాకు అది కుదరలేదు.. చాలామంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా స్థలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా స్టూడియో పెట్టడం పెద్ద సమస్య కాదు అని అనేవారు. అయితే మేము ఈ స్టూడియోని డబ్బు సంపాదించకపోవడం కోసం పెట్టలేదు. ఇది మా తాతగారి కోరిక ఆయన జ్ఞాపకార్థం దీన్ని స్థాపించాము. ఇక్కడ సినిమా షూటింగ్స్ బాగా జరగాలి పరిశ్రమ నుంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను’. అని అల్లు అర్జున్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు.