ఎన్టీఆర్ తన ఫ్రెండ్ అని నమ్మటం వలన… అన్ని కోట్లు మోసపోయాడా..!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న వయసులోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకొంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కోన సాగుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.

ఎన్టీఆర్ దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే ఎటువంటి వారికైనా ఎన్టీఆర్ సాయం చేయకుండా ఉండరు. అలా ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ ని వాడుకొని కొన్ని కోట్ల నష్టం తెచ్చి పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ స్నేహితులలో ఎక్కువగా నమ్మిన వారిలో ఒకరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి.. అతనే ఎన్టీఆర్ ని వాడుకుని మోసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తన కెరీయర్ మొదటి నుంచి అతని తో స్నేహం చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి, లాంటి సూపర్ హిట్ సినిమాలో రావడంతో ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ టైంలో అతను ఎన్టీఆర్ పేరు చెప్పి టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్‌లు దగ్గర డబ్బులు తీసుకుని ఎన్టీఆర్ కు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడట.

తర్వాత ఎన్టీఆర్‌కు వరుస డిజాస్టర్ లో రావడంతో… ఎన్టీఆర్ కెరియర్ కొంత డౌన్ ఫాల్ అయింది.. ఎన్టీఆర్ మీద నమ్మకంతో డబ్బులు ఇచ్చిన వారందరూ అతని స్నేహితుడు కనిపించకపోవడంతో అందరూ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి మా డబ్బులు ఇవ్వ‌మ‌ని అడిగారట. ఎన్టీఆర్ వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేసారట. తర్వాత ఆ స్నేహితుడు వచ్చి ఎన్టీఆర్‌ను క్షమించమని అడిగిన.. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ అతనితో ఇప్పుడు వరకు మాట్లాడలేదని ఎన్టీఆర్ ఆ వ్యక్తిని తన దరిదాపుల్లో కి కూడా రానివ్వటం లేదని తెలుస్తుంది.