నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదటి భాగం అంతా విదేశాలలో ఉంటుందట.. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమాకు సంబంధించిన మెయిన్ రోల్ ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ లకు ప్రేక్షకుల నుంచి ఎంత రెస్పాన్స్ లభించిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ని కూడా కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద పేరును ప్రకటించారు.
మరోపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్స్ కూడా భారీగా వస్తున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా మరో రెండు వారాల్లో పూర్తి అవుతుందట. ఒక షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా గ్యాప్ లేకుండా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
ఈ సినిమా బడ్జెట్ కూడా ఇప్పటికే 100 కోట్లు దాటేస్తున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఇది నిలుస్తుందని తెలుస్తుంది. అఖండ సూపర్ హిట్ తర్వాత మేకర్స్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో లిమిట్ పెట్టుకోకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా ఎవరు ఊహించిన విధంగా 90 కోట్ల వరకు జరుగుతుందట. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా భారీ స్థాయిలో ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటించడంతో కన్నడ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేటు పలికింది అని కూడా తెలుస్తుంది. ‘అఖండ’ సినిమా నిర్మాతలు కూడా 70 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇప్పుడు వీరసింహారెడ్డి కి 100 కోట్లు అంటే.. బాలయ్య మార్కెట్ మరో 30 కోట్లు పెరిగింది అన్నమాట.