మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న మ‌హేష్ బాబు.. వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కేవలం సినిమాలతోనే కాక నిజ జీవితంలో కూడా లో ఎన్నో మంచి పనులు మరియు సేవా కార్యక్రమాలు చేసి రియల్ సూపర్ స్టార్ హీరో అనిపించుకుంటున్నారు. మహేష్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాల పిల్లలకి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తూనే రెండు గ్రామాలను దత్తత కూడా తీసుకున్నాడు.

అలా మహేష్ తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వారికి అండగా ఉంటున్నాడు. మహేష్ ఇప్పటికే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చినప్పటికీ కూడా తాజాగా అక్కడి పిల్లలకి కంప్యూటర్ క్లాసులు మరియు డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు.

తాజాగా నమ్రత శిరోద్కర్ బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా… ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఆ ఫోటోల కింద `మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టిందంటూ“.. `ఇది చాలా గొప్ప రోజు` అని నమ్రత పోస్ట్ చేశారు. ఇక దీంతో మహేష్ బాబు మరోసారి తన గొప్ప మ‌న‌సు చాటుకున్నాడంటూ అభిమానులు మ‌హేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.