టార్గెట్ కొడాలి: ఆ పని సాధ్యమేనా?

ఒకప్పుడు రాజకీయాలు విధాన పరంగా ఉండేవి…నేతలంతా పాలసీ పరమైన అంశాలపై విమర్శలు చేసుకోవడం గాని, కౌంటర్లు ఇవ్వడం గాని చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు…వ్యక్తిగతమైన విమర్శలు…బూతులు తిట్టుకోవడం, అలాగే దాడులు చేయడం లాంటివే ఎక్కువ కనబడుతున్నాయి. అటు అధికార వైసీపీ అయిన, ఇటు ప్రతిపక్ష టీడీపీ అయిన ఇదే పంథాలో ముందుకు పోతుందని చెప్పొచ్చు.

అధికారం అంటే రాజకీయంగా పై చేయి సాధించడమే అన్నట్లుగా ఉంది..గతంలో టీడీపీ అధికారంలో ఉండగా…వైసీపీ నేతలని ఎలా ఇబ్బంది పెట్టారో తెలిసిందే. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే వైసీపీ అడ్రెస్ ఉండదని టీడీపీ నేతలు ఇప్పటినుంచే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు.

తాము అందరి పేర్లు రాసుకుని పెట్టుకున్నామని అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్క తెలుస్తామని అంటున్నారు. చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి నేత వరకు ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామనే తరహాలో వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఓ మీడియాలో జరిగిన ఇంటర్వ్యూలో టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత…అధికారంలోకి రాగానే తమ ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని డైరక్ట్ గా చెప్పేస్తున్నారు. అది కూడా చట్టపరంగానే వెళ్తామని కవరింగ్ డైలాగులు వేశారు.

కొడాలి నాని ఏ విధంగా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు…అందుకే ఆయన్ని టీడీపీ గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అంటున్నారు. అంటే వ్యక్తిగతమైన కక్షలు తప్ప…ఇందులో ప్రజలకు ఉపయోగ పడేది ఏమి లేదని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే కక్షలు తీర్చుకోవడమే తప్ప…ప్రజలకు పనులు చేసే పెట్టేలేదని కామెంట్లు వస్తున్నాయి. అయినా టీడీపీ అధికారంలోకి రావడం, కొడాలి నానికి చెక్ పెట్టడం అనేది సాధ్యపడని పని అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ముందు టీడీపీ అధికారంలోకి వస్తే గొప్ప అంటున్నారు. చూడాలి మరి నెక్స్ట్ అధికారం మారితే రాజకీయం ఎలా ఉంటుందో.