ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్.. స్టన్ చేసిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ‘ఆచార్య’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను సమ్మర్ ట్రీట్‌గా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏరియాల్లో ప్రీరిలీజ్ బిజినెస్ ముగిసినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ రేటుకు కోనుగోలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. చాలా కాలం తరువాత మెగాస్టార్ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఈస్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.38 కోట్లు
సీడెడ్ – రూ.20.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.13 కోట్లు
ఈస్ట్ – రూ.9 కోట్లు
వెస్ట్ – రూ.7.5 కోట్లు
గుంటూరు – రూ.9 కోట్లు
కృష్ణా – రూ.8 కోట్లు
నెల్లూరు – రూ.4.2 కోట్లు
ఏపీ+తెలంగాణ – రూ.109.2 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – రూ.12 కోట్లు
ఓవర్సీస్- రూ.12 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.133.2 కోట్లు