అసలే లేదు.. అయినా రిలీజ్ డేట్ ఫిక్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలు అందించాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.

ఇప్పటికే పవన్ ఓకే చేసిన సినిమాలు పూర్తి కావాల్సి ఉన్నా, వాటిని పక్కనబెట్టి, ఇప్పుడు మరో రీమేక్ చిత్రంపై మనసుపడ్డాడు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వినోధయా సీతం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడట పవన్. ఈ సినిమమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఆ తరువాత దర్శకుడు క్రిష్‌తో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడట. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయిన సంగతి తెలిసిందే.

పవన్ ఈ సినిమాను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో తెలియడం లేదని ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అప్పటివరకైనా ఈ సినిమాను రెడీ చేస్తారా లేదా అనేది ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. ఈ సినిమాను పవన్ త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కూడా కోరుతున్నారు.