అట్టర్ ఫ్లాప్ రాధేశ్యామ్.. 400 కోట్ల క్లబ్‌లో చేరిందట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో, ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు. అయితే తొలి ఆటకే ఈ సినిమాకు దారుణమైన నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా డిజాస్టర్ అనే రిజల్ట్ ఫిక్స్ అయిపోయింది.

ఇక ఫస్ట్ వీకెండ్ మినహా, ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల క్లబ్‌లో చేరినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో సినీ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా అవాక్కవుతున్నారు. అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రూ.400 కోట్లు ఎలా వచ్చాయబ్బా అంటూ అందరూ జుట్టు పీక్కుంటున్నారు. అయితే అసలు విషయం తెలుసుకుని.. ఒహో అదా మ్యాటర్ అని అనుకుంటున్నారు.

నిజానికి రాధేశ్యామ్ బాక్సాఫీస్ వసూళ్లు రూ.204 కోట్ల గ్రాస్ అని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. కాగా నాన్-థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుని ఈ చిత్రం రూ.400 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు మ్యాటర్ ఇదా అంటూ అందరూ నవ్వుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం కూడా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా రాధేశ్యామ్ 400 కోట్లు కలెక్ట్ చేసిందనేసరికి కొందరికి ఫ్యూజులు ఔట్ అయ్యాయన్నది మాత్రం నిజం.