మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్గా కనిపించబోతున్నాడు.
అలాగే బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. ఒక్కో అప్డేట్ను వదులుతూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంతి తరునంలో ట్రైలర్ వాయిదా పడనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ ట్రైలర్ ను ముంబైలో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా వస్తారని కూడా అన్నారు. కానీ, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.