అప్ప‌నంగా రూ.50 కోట్లు కొట్టేసింద‌న్న‌ నెటిజ‌న్‌..స‌మంత‌ షాకింగ్ రిప్తై!

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేసి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏడాళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగ‌రంగ వైభవంగా వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం ఘ‌నంగా జరిగింది.

కానీ, పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే చైసామ్‌ల బంధానికి బీట‌లు వారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవ‌రి దారి వారు చూసుకోవ‌డంతో.. ఫ్యాన్స్‌తో పాటు సినీ సెల‌బ్రెటీలు సైతం ఎంత‌గానో ఫీల్ అయ్యారు. మ‌రోవైపు ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ ఎవరికి తోచిన విశ్లేషణ వారు ఇచ్చేశారు. ముఖ్యంగా స‌మంత‌ను టార్గెట్ చేస్తూ కొంద‌రు దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు.

ఇప్ప‌టికీ ఆ విష‌యంలో సామ్‌పై ట్రోలింగ్ జ‌రుగుతూనే ఉంది. ఇక తాజాగా కమరాలీ దుకందర్ అనే ఓ నెటిజ‌న్ స‌మంత‌ను ఉద్ధేశిస్తూ నీచ‌మైన కామెంట్స్ చేశాడు. సమంత విడాకులు తీసుకుని నాశనమైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అంటూ అత‌డు వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఓ జెంటిల్మన్ నుంచి అప్పనంగా రూ.50 కోట్లు కొట్టేసిందని ఆరోపించాడు.

ఇది చూసిన స‌మంత‌..`నీ ఆత్మను దేవుడు దీవించుగాక` అంటూ షాకింగ్ రిప్తై ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు మ‌రియు ప‌లువురు నెటిజ‌న్లు సూప‌ర్ రిప్లై ఇచ్చావ్ అని, తిక్క కుదిరింద‌ని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ సంద‌ర్భంగా తామంతా సమంతకు ఎప్పుడూ బాసటగా ఉంటామని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/Samanthaprabhu2/status/1473263523983618051?s=20