కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన‌ `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంట‌నే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో న‌టించింది.

ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని అక్క‌డే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. కార్లంటే అమితంగా ఇష్ట‌ప‌డే కియారా వ‌ద్ద ఇప్ప‌టికే బీఎండబ్ల్యూ ఎక్స్‌5, మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈ-క్లాస్‌, బీఎండబ్ల్యూ 530డీ వంటి విలావంతమైన కార్లు ఉన్నాయి.

ఇక తాజాగా గ‌త ఏడాది భార‌త్ మార్కెట్‌లోకి వ‌చ్చిన ఆడి ఏ8 ఎల్ అనే ల‌గ్జ‌రీ కారును కియారా కొనుగోలు చేసింది. ఈ కారు ధ‌ర రూ.1.56 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. ప్ర‌స్తుతం కొత్త కారుతో కియారా అద్వానీ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇవి చూసిన కియారా ఫ్యాన్స్‌.. ఆమెకు విషెస్ తెలియ‌జేస్తున్నారు.

కాగా, కియారా సినిమాల విష‌యానికి వ‌స్తే.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈమె తెలుగులో చేస్తున్న చిత్రం `ఆర్సీ 15`. ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా ప‌లు బాలీవుడ్ చిత్రాల్లోనూ కియారా న‌టిస్తోంది.

https://twitter.com/Kiara_Fan_Club/status/1471000064570978305?s=20