ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా భయపెడుతోందట. ఇంతకీ సినిమా ఏదో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పెద్దన్న`. అన్నాచెల్లెలు బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు.
రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, రజనీకాంత్ చేసే హంగామా తప్ప కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అందువల్లే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. నాలుగేళ్ల క్రితం తాను తెరకెక్కించిన వేదాళంనే అటు తిప్పి, ఇటు తిప్పి డైరెక్టర్ శివ పెద్దన్నను రూపొందించాడనే టాక్ కూడా వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ విషయమే చిరంజీవిని కలవర పెడుతోంది. ఎందుకంటే, పెద్దన్న సినిమాలో రజినీకాంత్, కీర్తి సురేష్ ఇద్దరూ అన్నా చెల్లెలు గా నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే అదే అన్నా చెల్లెలు కాన్సెప్టుతో `భోళా శంకర్` రాబోతోంది. ఈ మూవీలో కీర్తి సురేషే చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. పైగా పెద్దన డైరెక్టర్ శివ తెరకెక్కించిన వేదాళంకి రీమేక్గానే భోళా శంకర్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు ఈ ఆంశలన్నీ ఎక్కడ తన సినిమాకి మైనస్ అవుతాయో అని చిరంజీవి ఖంగారు పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.