స‌మ్మ‌ర్‌కి షిఫ్ట్ అయిన `సర్కారు వారి పాట`..కొత్త డేట్ ఇదే!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Keerthy Suresh Joins The Cast Of Mahesh Babu's Sarkaru Vaari Paata | RITZ

ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, అదే స‌మ‌యానికి పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` బ‌రిలోకి దిగుతుండ‌డంతో.. స‌ర్కారు వారి పాట స‌మ్మ‌ర్‌కి షిఫ్ట్ అయింది.

Image

ఈ విష‌యాన్ని తాజాగా తెలియ‌జేసిన మేక‌ర్స్ ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్ర‌క‌టించారు. దాని ప్ర‌కారం.. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. కాగా, బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మ‌హేష్ బ్యాంకు మేనేజ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు.