ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన అభిమాని..ఎందుకో తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కి ఓ అభిమాని సోష‌ల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అస‌లు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కార‌ణం చేత పంపాడు..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. మేకర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేయ‌లేదు. ఎప్పుడో ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకి ఓ టీజ‌ర్ వ‌దిలారు త‌ప్పితే.. ఆ త‌ర్వాత ఈ సినిమా నుంచి ఒక్క‌టంటే ఒక్క అప్డేట్ కూడా రాలేదు.

Makers of Prabhas and Pooja Hegde starrer 'Radhe Shyam' announce release  date | The News Minute

ఈ నేప‌థ్యంలోనే తీవ్ర ఆవేద‌న‌కు గురైన ఓ అభిమాని..`ఇప్ప‌టి వ‌ర‌కు లెట‌ర్ రాయ‌ని తాను ఆత్మ‌హ‌త్య లేఖ రాస్తాన‌ని అనుకోలేదు, రాధేశ్యామ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ఇదంతా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే చాలా రోజులు వెయిట్ చేశాం. ఇక ఎదురుచూసే ఓపిక లేదు, త‌న చావుతో అయినా అప్‌డేట్స్ ఇస్తార‌ని భావిస్తున్నా ..ఫ్యాన్స్ ఎమోష‌న్స్‌తో ఆడుకోవ‌ద్దు` అని లేటెర్ రాశాడు. అంతేకాదు, నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే అని పేర్కొంటూ ఆ లెట‌ర్‌ను ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌భాస్‌కి పంపాడు. దీంతో ఇప్పుడా లెట‌ర్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి దీనిపై రాధేశ్యామ్ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

https://twitter.com/Vamsi48324621/status/1458766850406313984?s=20