చిరు ఆచార్య నుంచి సరికొత్త అప్డేట్..!!

మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అలాగే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ కు జోడిగా పూజాహెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టులు, వీడియోలు, మొదటి పాట కూడా మంచి ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా ఈ సినిమాపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 

తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.. ఆచార్య సినిమా యూనిట్ తాజాగా ఒక పోస్ట్ ను కూడా విడుదల చేయడం జరిగింది.. ఇకపోతే వింటేజ్ మణిశర్మ మెలోడీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను ఈరోజు ఉదయం 11:07 గంటలకి రివీల్ చేయనున్నారు. ఇకపోతే 2022 ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.