పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `రాధేశ్యామ్`. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది.
ఇక ఇటీవల ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన రాధేశ్యామ్ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్తో అదిరిపోయే రికార్డులను సృష్టించింది. అయితే దీపావళికి తన ఫ్యాన్స్ను ప్రభాస్ మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్నాడట. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. దీపావళి కానుకగా నవంబర్ 4న మరో టీజర్ను రాధేశ్యామ్ మేకర్స్ విడుదల చేయబోతున్నారని సమాచారం.
ఈ టీజర్లో ప్రభాస్తో పాటుగా పూజా హెగ్డే కూడా కనిపించబోతోందట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.