మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది.
కానీ, కరోనా అడ్డుపడింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. డిసెంబర్ 17న విడుదల అవుతుందనీ, సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందనీ రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ రూమర్లకు చిరు తెర దించాడు.
ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతోందని తెలియజేస్తూ తాజాగా చిత్రయూనిట్ ఓ అదిరిపోయే పోస్టర్ను వదిలింది. ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. కాగా, సామాజిక ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఆచార్యకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.