సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఉన్నట్టు ఉండి ఆయన హాస్పటల్లో చేరడం సస్పెన్స్గా మారగా.. మరోవైపు రజనీ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన అభిమానుల్లో ఖంగారు మొదలైంది.
ఈ నేపథ్యంలోనే రజనీకాంత్కి ఏమైంది..? ఎందుకు హాస్పటల్లో చేరారు..? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లత ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
సాధారణ హెల్త్ చెకప్లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని లత తెలిపారు. దాంతో రజనీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా, రజనీ ఇటీవల భారత ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన తాజా చిత్రం ‘అన్నాత్తే (తెలుగుతో పెద్దన్న)` నవంబరు 4న విడుదల కాబోతోంది.