నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుంచీ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు రిలీజ్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 900 థియేటర్స్ లో ఈ మూవీని గ్రాండ్గా విడుదల చేశారు. సినిమా చూసిన ఆడియన్స్ తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ సెకండాఫ్కి వచ్చే సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారనే టాక్ వస్తోంది. అంతేకాదు, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని కొందరు అంటున్నారు.
ఇక లవ్ స్టోరీ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఏకంగా రూ.31.2 కోట్ల బిజినెస్ చేసిందట. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.32 కోట్ల కలెక్షన్స్ను రాబట్టాల్సి ఉంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత బిజినెస్ జరగడం చాలా కష్టం. కానీ లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలు విడుదలైన తీరు, పాజిటివ్ టాక్ చూస్తుంటే.. అంత మొత్తంలో కలెక్షన్స్ వసూలు చేయడం పెద్ద కష్టం కాదనిపిస్తుంది. మరి చైతు తన బాక్సాఫీస్ టార్గెట్ ను రీచ్ అవుతాడో..లేదో..చూడాలి.