మ‌న‌సు మార్చుకున్న మ‌హేష్‌..త్రివిక్ర‌మ్‌కు బిగ్ షాక్‌..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే మ‌హేష్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు.

Sarkar Vari Pata First Look Glimpse | Keerthy Suresh | Parasuram | #HBDMaheshBabu | ISPARKMEDIA | - YouTube

ఈ రెండు చిత్రాలను ఏకకాలంలోనే పూర్తి చేసేసి.. ఆ వెంట‌నే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించాల‌ని మ‌హేష్ భావించారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్ మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. స‌ర్కారు వారి పాట పూర్తి చేసిన త‌ర్వాతే త్రివిక్ర‌మ్ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

Mahesh Babu: తండ్రితో మహేష్ బాబు పోరాటం.. బయటకొచ్చిన సీక్రెట్! పక్కాగా స్కెచ్చేస్తున్న త్రివిక్రమ్ - ssmb 28: mahesh babu role in trivikram srinivas movie | Samayam Telugu

ఈ లెక్క‌న న‌వంబ‌ర్‌ చివ‌ర్లో లేదా డిసెంబ‌ర్ మొద‌ట్లో త్రివిక్ర‌మ్‌-మ‌హేష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే త్రివిక్ర‌మ్ మ‌హేష్ సినిమాను త‌ప్పా మ‌రే సినిమాను టేక‌ప్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ షురూ చేయాల‌ని ఆయ‌న ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, మ‌హేష్ ఆ ప్రాజెక్ట్‌ను మ‌రింత వెన‌క్కి నెట్ట‌డంతో.. త్రివిక్రమ్‌కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్టైంది.