నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా ఓ స్టార్ హీరో ఈయనకు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`ను పూర్తి చేసిన బాలయ్య ఆ తర్వాత తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని సంప్రదించినట్టు ఈ మధ్య జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ సమచారం ప్రకారం.. విజయ్ విలన్గా నటించేందుకు నో చెప్పాడని తెలుస్తోంది.
వరుస ప్రాజెక్ట్స్ కారణంగానే విజయ్ నో చెప్పాడని టాక్ నడుస్తోంది. కాగా, మరోవైపు బాలయ్యకు జోడీగా నటించాలని ఆ మధ్య శ్రతి హాసన్ను సంప్రదించగా.. ఆమె సున్నితంగా తిరస్కరించిందని, అయితే బాలయ్య మీద ఉన్న అభిమానం, డైరెక్టర్ సెంటిమెంట్ను కాదనలేక శ్రుతి అతిథి పాత్ర ఏమైనా ఉంటే చేస్తాని చెప్పినట్టు తెలుస్తోంది.