బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. సినిమా ట్రైలర్ లో మాహిళల్ని కించపర్చారని మహిళా సంఘాలు ఆరోపణ చేశాయి.
ఈ క్రమంలోనే సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ తెలంగాణా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. సినిమా విడుదల ఆపేయాలంటూ పలు మహిళా సంఘాలు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి. మరి ఊహించని వివాదంలో చిక్కుకున్న క్రేజీ అంకుల్స్.. ఎలా ఈ సమస్య నుంచి బయటపడి థియేటర్లో విడుదల అవుతుందో చూడాల్సి ఉంది.