చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్ర‌ముఖ హీరోయిన్‌?

ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో బిజీగా ఉన్న‌ టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ త‌న 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ‌వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌బోతున్నారు.

Ram Charan Fans! Here's When Shankar's RC 15 With Kiara Advani Is All Set  To Go On Floor & It's Not Faraway

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో కియారానే కాకుండా మ‌రో హీరోయిన్ కూడా క‌నిపించ‌బోతోంద‌ట‌.

Tamannaah Bhatia tests positive for COVID 19; Admitted to a private  hospital in Hyderabad | PINKVILLA

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించే ఛాన్స్ త‌మ‌న్నా కొట్టేసింద‌ని తెలుస్తోంది. అయితే హీరోయిన్ గా కాద‌ట‌. విలన్ భార్యగా తమన్నా నటిస్తోంద‌ని.. హీరోయిన్ కి సమాంతరంగా ఆ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. కాగా, గ‌తంలో చ‌ర‌ణ్‌, త‌మ‌న్నా జంట‌గా ర‌చ్చ సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే.