ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నారు.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కియారానే కాకుండా మరో హీరోయిన్ కూడా కనిపించబోతోందట.
ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. లేటెస్ట్ సమాచారం ప్రకారం చరణ్, శంకర్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ తమన్నా కొట్టేసిందని తెలుస్తోంది. అయితే హీరోయిన్ గా కాదట. విలన్ భార్యగా తమన్నా నటిస్తోందని.. హీరోయిన్ కి సమాంతరంగా ఆ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. కాగా, గతంలో చరణ్, తమన్నా జంటగా రచ్చ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.