టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో త్వరలోనే ఈ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దర కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలు సాధించడంతో.. వీరి మూడో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే రాజశేఖర్తో సంప్రదింపులు జరపారని.. కథ విన్న ఆయన కూడా విలన్గా నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాకు గానూ రాజశేఖర్ పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ మూవీకి రూ. 4 కోట్లు పారితోషికంగా ఇవ్వాలని, అంతేకాకుండా తన పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉండేలా చూడాలని షరతులు విధించాడట. అందుకు దర్శక, నిర్మాతలు సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.