జెమినీ టీవీలో త్వరలోనే స్టార్ట్ కాబోతున్న అతి పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (ఇఎంకె)కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆగష్టు 22ను ప్రసారం కాబోతోంది. ఇక అనుకున్నట్టుగానే ఫస్ట్ ఎపిసోడ్ను స్పెషల్ ఎపిసోడ్గా మార్చి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు.
అంతేకాదు, తాజాగా ఈ స్పెషల్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో సాగిపోయిన ఈ ప్రోమో ప్రేక్షకులకు తెగ ఆకట్టుకుంటుంది. అలాగే ప్రోమోలో చరణ్ `నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నా` అని అనడంతో.. `బాబోయ్ నీకు దండం పెట్టేస్తా, అవి ఇక్కడ వద్దు` అని ఎన్టీఆర్ అంటుడడం నవ్వులు పూయిస్తోంది.
మొత్తానికి అదిరిపోయిన ఈ ప్రోమో.. షోపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. అలాగే తొలి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదని తాజా ప్రోమో బట్టీ స్పష్టంగా అర్థం అవుతోంది. కాగా, ఎన్టీఆర్-చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇఎంకె స్పెషల్ ఎపిసోడ్ ద్వారా ఆర్ఆర్ఆర్ కు కావాల్సినంత ప్రమోషన్ వచ్చేయడం ఖాయం.
https://youtu.be/SINxvviCKTo