పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో `సలార్` ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న తేదిన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ, అదే తేదీని ప్రశాంత్ నీల్, యష్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్-2 కబ్జా చేసిన సంగతి తెలిసిందే. దాంతో సలార్ ముందు అనుకున్న తేదీకి రిలీజ్ కాదని స్పష్టంగా అర్థమైపోయింది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సలార్ చిత్రం విడుదలకు కొత్త డేట్ను మేకర్స్ లాక్ చేశారట. వచ్చే యేడాది విజయ దశమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దాదాపు పండగ రోజునే సలార్ రిలీజ్ డేట్గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.