గ్యాప్ ఇవ్వ‌ని మ‌హేష్‌..అదే కావాలంటున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు.

Mahesh Babu and Keerthy Suresh look perfect in new Sarkaru Vaari Paata  still. Seen yet? - Movies News

అయితే ఈ మ‌ధ్య స‌ర్కారు వారి పాట‌ నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. దాంతో ఇదే మాకు కావాలంటూ మ‌హేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక తాజాగా కూడా మేక‌ర్స్‌ ఈ మ‌వీ నుంచి ఓ ఫోటోను విడుద‌ల చేసింది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన స‌ర్కారు వారి పాట టీమ్‌.. వెంటనే గోవాలో ప్రత్యక్షమైంది.

Image

గోవాలో షెడ్యూల్ ప్రారంభించినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేస్తూ.. తాజాగా ఓ పిక్‌ని విడుదల చేసింది. ఇందులో మ‌హేశ్‌, ప‌ర‌శురాం, రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ నెక్స్ట్ తీయబోయే సీన్ గురించి డిస్క‌స్ చేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టంట వైర‌ల్‌గా మారింది.