కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అభిమానులపై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిపడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. మొన్నీమధ్య విజయ్ నటిస్తున్న `బీస్ట్` సెట్స్లో ధోనీ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.
షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోలతో విజయ్ అభిమానులు వివాదం సృష్టించారు. ఎంఎస్ ధోనీ ఈ దేశానికి పీఎంగానూ.. విజయ్ను రాష్ట్రానికి సీఎంగానూ ఉండాలని పోస్టర్లు క్రియేటి చేశారు.
అంతేకాదు, వాటిని తమిళనాడులోని మధురైలో అంటించారు. అయితే ఇప్పుడు ఆ పోస్టర్లు వివాదంగా మారాయి. ముఖ్యంగా ఈ పోస్టర్ల విషయంలో ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే ధోనికి ఇలాంటివి అంటకట్టవద్దంటూ విజయ్ అభిమానులపై సోషల్ మీడియా వేదికగా ధోనీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.