నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉన్నట్టు ఉండి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించనున్నారు.
అయితే ఈ కేసులో ఈడీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు భారీగా డబ్బు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో ఇంటర్పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది.
అలాగే విదేశాలకు నిధుల తరలింపుపై టాలీవుడ్ తారలనూ విచారించబోతోంది. ఇప్పటికే డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ల వాగ్మూలాన్ని సేకరించారు. ఇక 12 మంది సినీ తారాల విచారణ అనంతరం మరికొంతమందికి ఈడీ నోటీసులు జారీ చేయనుందని సమచారం. కాగా, ముగిసిపోయిందనుకున్న డ్రగ్స్ కేసు మళ్లీ ఇప్పుడు సంచలన రేపడంతో.. టాలీవుడ్ తారల్లో టెన్షన్ టెన్షన్ మొదలైంది.
విచారణ తేదీలు, హాజరవ్వాల్సిన ప్రముఖులు:
Aug 31- పూరీ జగన్నాథ్
Sept 2 – చార్మీ కౌర్
Sept 6 – రకుల్ ప్రీత్ సింగ్
Sept 8 – రానా దగ్గుబాటి
Sept 9 – రవితేజతో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్
Sept 13- నవ్దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్
Sept 15- ముమైత్ ఖాన్
Sept 17- తనీష్
Sept 20- నందు
Sept 22- తరుణ్, తనీష్, నందు