మొన్నీ మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి మద్ధతుగా తన పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయమని అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ రూట్లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగష్టు 22) చిరు పుట్టిన రోజు.
ఈ సందర్భంగా చిరు తన అభిమానులకు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న తన జన్మదినం సందర్భంగా `గ్రీన్ ఇండియా ఛాలెంజ్` కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. `ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గం.
అందుకు, యంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మీరంత పాల్గొనాలి, మూడు మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫొటోలను నాకు ట్విట్టర్లో ట్యాగ్ చేయండి` అంటూ ట్వీట్ చేశారు చిరు.
https://twitter.com/KChiruTweets/status/1428935216433831942?s=20