రష్మిక మందన్నా..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక ఈమె నటిస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఒకటి. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్లో రష్మిక కూడా పాల్గొంటోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని రష్మిక సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్లో పాల్గొన్నానని.. షూటింగ్ ఎంతో సరదాగా సాగుతుందని చెప్పుకొచ్చింది రష్మిక. అలాగే సెట్లోకి శర్వానంద్ తన పెట్ను తీసుకొచ్చేసరికి ఎంతో షాకింగ్గా అనిపించిందని తెలిపింది. మరియు శర్వా పెట్ సూపర్ క్యూట్గా ఉందని, దాన్ని మరచిపోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.