టాప్ హీరోయిన్ అయినా కూడా… పెళ్లి తర్వాత ఇలాంటి పని చేసిందా..?

టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారు ఎంతో కష్టపడితే కాని ఆ స్టేజ్ కి రావడం కుదరదు. కానీ మరికొంతమంది హీరోయిన్లు మాత్రం ఎంత కష్ట పడిన వారికి స్టార్డం రావడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలా స్టార్ డం వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని వివాహం చేసుకున్న తర్వాత అతనితో విడిపోయి.. ఏం చేసింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అలనాటి తార సరిత దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. అంతేకాకుండా ఈమె కొంత మంది నటులకు కూడా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 151 చిత్రాలలో నటించింది. అంతేకాకుండా ఈమెకి ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు నంది అవార్డు కూడా దక్కించుకుంది.

ఇక ఈమె మొదటి సారిగా బాలచందర్ డైరెక్షన్ లో”మరో చరిత్ర” సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత మహేష్ బాబుతో కలిసి అర్జున్ సినిమాలో విలన్ పాత్రలను పోషించింది. ఇక ఈమె 1975 సంవత్సరంలో రంగస్థల నటుడు వెంకటసుబ్బయ్య వివాహం చేసుకున్నది. కానీ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు.

ఇక ఆ తర్వాత 1988లో మలయాళ నటుడు ముఖేష్ వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. అలా ఎంతో ఫాం ఒక జీవితం సాగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య కూడా మరి మనస్పర్ధలు రావడంతో.. కోర్టు ద్వారా 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత ముఖేష్ ఒక క్లాసికల్ డాన్సర్ అయినటువంటి మైథిల్ దేవి కన్ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరి వివాహం చెల్లదని సరిత కోర్టును ఆశ్రయించగా, ముఖేష్ నాకు నోటీసులు పంపించకుండా తనను వివాహం చేసుకున్నాడు కాబట్టి, ఆ వివాహం చెల్లదంటూ కోర్టు తీర్పు ఇవ్వాలని, ఆమె కోర్టు మధ్యలోనే తప్పి పడిపోయింది.