విక్టరీ వెంకటేష్, మీనా జంటగా జీతు జోసెఫ్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్తో తెలుగులోనూ తెరకెక్కించారు.
సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్రకారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వచ్చేస్తోందట.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్కు, దృశ్యం మేకర్స్కు మంచి డీల్ కుదిరిందని.. దాంతో హాట్స్టార్కే డైరెక్ట్ డిజిటల్ హక్కులను ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, వెంకీ తాజా చిత్రం నారప్ప అమెజాన్ ప్రైమ్లో జూలై 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే.