ప్రభాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తి అయింది.

Image

అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది చిత్రయూనిట్. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ ప్ర‌భాస్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

Image

కాగా, ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్‌, ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనున్నారు. భాగ్యశ్రీ, మురళీశర్మ, సచిన్‌ ఖేద్కర్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌, ప్రసీదా సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించారు.