టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్టపడని వారూ ఉండరు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్రభాస్ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
తాజాగా ఈయన బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీకి సర్ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్గా పంపి భాగ్యశ్రీని ఆనందంలో ముంచెత్తారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
హైదరాబాదీ మిఠాయిల్లో ప్రత్యేకమైన పూతరేకులను అందుకున్నాను. థ్యాంక్స్ ప్రభాస్. నా అభిరుచిని మార్చేశారు అని ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చారు. అంతేకాదు, స్వీట్బాక్స్ ఫొటోలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దాంతో భాగ్యశ్రీ పోస్ట్ వైరల్గా మారింది. కాగా, ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్లో భాగ్యశ్రీ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
https://twitter.com/bhagyashree123/status/1410535353497186305?s=20