ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బుల్లబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లతో యమా జోరుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తున్న పూజా.. తమిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది.
మరోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే ఈ చిత్రంలో పూజా హెగ్డేనే హీరోయిన్గా ఎంపిక చేశారని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సిందే. కాగా, ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాత.