సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవీ మళ్లీ ఐస్క్రీమ్పై మనసు పారేస్తుకున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నవదీప్, తేజస్వి మదివాడలతో ఐస్క్రీమ్ సినిమాను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఆ తర్వాత జె. డి. చక్రవర్తి, మృధుల భాస్కర్, నవీనలతో ఐస్ క్రీమ్ 2 తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు ఐస్క్రీమ్ 3ని తెరకెక్కించేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నాడట.
ఐస్క్రీమ్, ఐస్క్రీమ్ 2లను నిర్మించిన సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.